అసెంబ్లీ ఎన్నికలు... తెలంగాణలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు

  • ఎల్లుండి.. 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్
  • బుధవారం పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలింపు
  • విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లుండి... గురువారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంతో పాటు తెలంగాణలోని పలుచోట్ల విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలిస్తున్నారు. దీంతో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవును ప్రకటించారు.

Telangana Assembly Election
BRS
BJP
Congress

More Telugu News